తేడా కొడుతున్న ‘‘చిరు’’ సినిమాలు, ఇక వినయ్ దిగాల్సిందేనా.. మెగా క్యాంప్‌లో అంతర్మథనం

News

సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవికి సరైన హిట్ లేదు. సైరా నర్సింహారెడ్డి, ఆచార్య సినిమాలు మెగా అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో మెగా క్యాంప్‌లో ఆందోళన నెలకొంది. దీంతో చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేర్ వీరయ్య తదితర సినిమాల భవితవ్యంపై చర్చ మొదలైంది. దీంతో చిరు ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తయిన తర్వాత తనకు బాగా అచ్చొచ్చిన వి. వి. వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్నట్టు ఫిలింనగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ ఆరంభమైందనే చెబుతున్నారు. చిరంజీవికి ‘ఠాగూర్’ .. ‘ఖైదీ నెంబర్ 150’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను ఇచ్చాడు వినయ్. అందుకే ఆయనపై మెగాస్టార్‌కి విపరీతమైన నమ్మకం ఉంది. తన స్టైల్ .. తన నుంచి అభిమానులు కోరుకునే అంశాలు వినాయక్ కి బాగా తెలుసు. అందుకే ఆయనకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అవసరమైతే ఈ ప్రాజెక్ట్‌ల మధ్యలోనే వినాయక్‌తో సినిమా చేసి మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనలో చిరంజీవి వున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *