అర్జున్ అంబటి, చైతన్య రావు.. లు హీరోలుగా సతీష్ రాపోలు దర్శకత్వంలో ఓ మిస్టరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న చిత్రం ‘తెప్ప సముద్రం’. బేబి వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్పై నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరమీను ఫేమ్ కిశోరి ధాత్రక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బొమ్మాళి రవిశంకర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో సింగర్ మంగ్లీ పాడిన మాస్ బీట్ సాంగ్ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఇదిలా ఉండగా.. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. “భగవద్గీత మహాభారతంలో ఒక భాగం కాదు.. మహాభారతమే భగవద్గీతలో ఒక భాగం.. భగవద్గీత ఒక మత గ్రంథం కాదు.. మనిషి గ్రంథం..” అనే కొటేషన్లోనే అర్థం వచ్చేలా ఈ ఫస్ట్ లుక్ ఇంటెన్సిటీని రేకెత్తించే విధంగా ఉంది. ఇప్పటివరకు భగవద్గీతను ఒక మతానికి చెందినది అనే అంతా అనుకుంటున్నారు. కానీ భగవద్గీత కేవలం ఒక మతానికి కాదు మనుషులందరికీ సంబంధించింది అనేది ఈ చిత్రం ద్వారా చూపించనున్నారు.
Read more :సినీ కార్మికుల వేతనాల పెంపు.. చర్చలు మొదలెట్టాం, త్వరలోనే క్లారిటీ : దిల్రాజు