adipurush : శ్రీవారి ఆలయం ముందు హీరోయిన్ కు ముద్దులు.. ఆదిపురుష్ దర్శకుడి పై ట్రోలింగ్

News

ప్రభాస్ హీరోగా రూపొందిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. జూన్ 16 రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో ఘనంగా జరిగింది. లక్ష మంది అభిమానుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా అంగరంగవైభవంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికి ముందు… అంటే ఉదయం పూత ఆదిపురుష్ టీం అంతా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు.

అనంతరం బయటకు వచ్చిన టీం కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో కృతి సనన్ వేరే సినిమా షూటింగ్ కు హాజరవ్వాల్సి ఉండగా.. ఫ్లైట్ టైం అవుతుంది అని ఆమె బయల్దేరుతున్నట్టు టీంకి చెప్పింది. అప్పుడు దర్శకుడు ఓం రౌత్.. హీరోయిన్ కృతి సనన్ ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

అంతేకాదు ఆలయం ముందు ఇలాంటి పనులు చేయడం ఏంటి అంటూ దర్శకుడు ఓం రౌత్ పై నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రతి ఒక్కరూ పద్దతిగా వ్యవహరించాలి అనే నియమం ఉంది. ఓం రౌత్, కృతి సనన్ నార్త్ కు చెందిన వారే కావచ్చు… వారికి ఇది చిన్న విషయమే కావచ్చు.. కానీ తిరుమల దేవస్థానం యొక్క నియమాలు కొంచెం కూడా తెలీకుండా ఇలా ప్రవర్తించడంతో విమర్శల పాలవ్వక తప్పలేదు. అందులోనూ ‘ఆదిపురుష్’ సినిమాలో కృతి సనన్ సీతమ్మ తల్లిగా కనిపించబోతుంది.ఇలాంటి టైంలో అలా నెగిటివ్ గా ప్రవర్తించడం అనేది సినిమా పై చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్పాలి.

Read more : Sarath Babu : పోలీస్ అవుదామనుకున్న కలను చిదిమేసిన లోపం .. శరత్ బాబు జీవితంలో ఎత్తుపల్లాలెన్నో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *