‘మణి శంకర్’ మూవీ ఘన విజయం సాధిస్తుంది : మురళీ మోహన్

News

Manishankar : శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని హీరో హీరోయిన్లుగా ప్రియా హెగ్దే, చాణ‌క్య కీలక పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘మణిశంకర్’.జి.వి.కె(జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌)  ఈ చిత్రానికి  కథ, స్క్రీన్ ప్లే, మాటలు, మరియు దర్శకత్వం వహించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణి భూషణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రయూనిట్ ఆడియో లాంచ్ వేడుకను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ క్రమంలో  మ‌ణిశంక‌ర్ బిగ్ ఆడియో సీడీని వీఐపీ ప్రైమ్‌ సీఈవో సతీష్‌ రెడ్డి  ఆవిష్క‌రించారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘మేం అంతా కూడా రియల్ ఎస్టేట్‌లో పార్ట్నర్స్ . శంకర్ గారు తీసిన మణిశంకర్ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. శివ కంఠమనేని హీరోగా, నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందించడం గర్వంగా అనిపిస్తుంది. అశోక్ గారు, కళ్యాణ్ గారు ఇండస్ట్రీల్లో ఉన్న పెద్దలలో ఒకరు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వారు అందుబాటులో ఉంటారు. సంజన గారితో నేను చాలా సినిమాల్లో కలిసి న‌టించాను. ‘మణిశంకర్’ ట్రైలర్ చూస్తుంటే డబ్బు చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని స్పష్టమవుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ తెలిపారు.

 నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘తండ్రి ఇష్టాలను తెలుసుకుని, వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న శంకర్ కొడుకుల‌కి థాంక్స్. ప్రతీ  సినిమాకు నాతో క్లాప్ కొట్టిస్తారు. మాది ఎన్నో ఏళ్ల స్నేహబంధం. వల్లభనేని జనార్థన్ ఇంటి నుంచే మేం అంతా వచ్చాం. ఆయన ఆరోగ్యం బాగుండాలని మేం మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. శివ నటనను చూసి నేను ఆశ్చర్యపోయాను. కానీ రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా బిజీగా ఉంటాడు. ఇప్పుడు కూడా మంచి చిత్రంతోనే వస్తున్నాడని అనుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతం అవ్వాలి. మంచి హిట్ అయి ఇంకో పది సినిమాలు తీయాలని అనుకుంటాడు. ఈ సంస్థ ప్రతీ నెలా ఈ సంస్థ‌ రెండొందల మందికి భోజనం పెడుతూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

వీఐపీ ప్రైమ్‌ సీఈవో సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘మణిశంకర్ కథను డైరెక్టర్ నాకు చెప్పడానికి ట్రై చేస్తుంటే ముందు నేను అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సినిమా చూపించండని అడిగాను.చూపించారు. అద్భుతంగా తీశారు అనిపించింది. స్ట్రీమింగ్ తరువాత చూసుకుందాం.. అవుట్ రైట్‌గా ఎంతకిస్తారు? అని అడిగాను. సంక్రాంతికి ఈ సినిమా రాబోతోంది. నేరుగా ఓటీటీకి ఓ సినిమాను కొన్నామంటే అందులో ఎంత డెప్త్ ఉందో అర్థం చేసుకోండి. ఓటీటీ సంస్థలేవీ కూడా నిర్మాతల నుంచి డబ్బులను ఆశించవు. సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ ఓటీటీ సంస్థలు సాయం చేస్తూనే ఉన్నాయి. నేను కూడా మన తెలుగు సినీ పరిశ్రమకు సాయంగా ఉంటాను. నేను కూడా ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌ని. ‘రేపటి పౌరులు’ అనే సినిమాలో నటించాను. కన్నడలో కూడా హీరోగా ఓ సినిమాను  చేశాను. సచిన్ జోషి హీరోగా నటించిన మౌనమేలనోయి సినిమాను నిర్మించాను. మంచి సినిమాలకు నేను ఎప్పుడూ అండగా నిలబడతాను’ అంటూ చెప్పుకొచ్చారు.

హీరో కంఠమనేని మాట్లాడుతూ.. “మ‌ణిశంక‌ర్ మంచి కాన్సెప్ట్ తో రూపొందింది. నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో సినిమాను నిర్మించడం జరిగింది. ద‌ర్శకుడు జీవీకే మంచి విజ‌న్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇళయరాజా శిష్యుడు ఎం ఎల్ రాజా మా సినిమాకు మంచి సంగీతం అందించాడు. మా డీఓపీ జేపీ గారు ఎంతో సహకరించారు. నటీనటులు చాలా చక్కగా నటించారు” అంటూ చెప్పుకొచ్చాడు.

డైరెక్టర్ జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌ మాట్లాడుతూ.. ‘శంకర్‌గారు కథ విన్న వెంటనే సోల్ పట్టేసుకున్నారనిపించింది. సంజన గారు చేసిన ఈ పాత్రలో చాలా డైమన్షన్స్ ఉంటాయి. అందుకే ఆమెను ఆ పాత్ర కోసం అడిగాం. ప్రియా హెగ్దే, చాణ‌క్యలు కూడా చాలా బాగా చేశారు. సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేశారు. జనవరి మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం.’ అంటూ చెప్పుకొచ్చారు

హీరోయిన్ సంజన గల్రానీ మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత నాకు ఈ ఆఫర్ వచ్చింది.ఇందుకు శివ కంఠమనేని, బాబి గారికి థాంక్స్ చెప్పాలి. శివ కంఠమనేని గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉంది.చాలా చక్కగా చేశారు. ఆయన పెద్ద స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్ రెడ్డి గారితో పని చేయడం ఆనందంగా అనిపించింది. మా నిర్మాతలు చాలా మంచి వారు. చక్కటి ప్లానింగ్‌తో సినిమాను నిర్మించారు. ఈ చిత్రయూనిట్‌తో పని చేయడం నాకు ఆనందంగా ఉంది. మీకు సినిమా నచ్చితే ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి’ అంటూ చెప్పుకొచ్చింది.

ఈ ఆడియో లాంచ్ లో  సినిమాటోగ్రాఫ‌ర్ జే ప్రభాక‌ర్ రెడ్డి, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎల్ రాజ కూడా పాల్గొన్నారు.

 

Read more : సినీ కార్మికుల వేతనాల పెంపు.. చర్చలు మొదలెట్టాం, త్వరలోనే క్లారిటీ : దిల్‌రాజు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *