5 వేరు వేరు కథలతో ఆంథాలజీ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం `పంచతంత్ర కథలు`. మధు క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతు న్నారు.సింగర్ మరియు నటుడు అయిన నోయెల్ ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తుండగా.. నందినీ రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం నుండి విడుదలైన `మోతెవరి` విశేషదారణ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి రిలీజ్ చేశారు.
ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ : “గంగనమోని శేఖర్ దర్శకత్వంలో మధు క్రియేషన్స్ పతాకంపై ‘పంచతంత్ర కథలు’ అనే ఈ ఆంథాలజీ ఐదు వేరు వేరు కథలు..వేరు వేరు జోనర్లలో రావడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ట్రైలర్ చూడ్డానికి చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్స్ అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. అన్నింటినీ మించి ఈ చిత్రంలో మా ఫ్యామిలీ మెంబర్ గా భావించే నోయెల్ నటిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను“అన్నారు.
ఇక సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న `పంచతంత్ర కథలు` యు/ ఎ సర్టిఫికేట్ ను పొందింది. సెన్సారు
సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం చిత్ర బృందాన్ని అభినందించారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
తారాగణం: నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ తదితరులు